Skip to main content

కంప్యూటర్‌తో ఎంతసేపు పని చేస్తున్నారు...?

ప్రస్తుతం చాలామంది కంప్యూటర్ ముందు కూర్చుని దాదాపు ఎనిమిది నుంచి పది గంటలవరకు పని చేస్తున్నారు. ఇది నిత్యకృత్యం అయిపోతోంది. దీంతో మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి రెండూ పెరిగి పోతున్నాయి. వెంటనే రాత్రి అయ్యేటప్పటికి అలసటకు గురౌతుంటారు.

కంప్యూటర్ ముందు కూర్చుని తదేకంగా చూస్తూ ఉండటం మూలాన కళ్ళకు శ్రమ ఎక్కువ కలుగుతోంది. అలాగే కొన్ని కానరాని సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంది.

నష్టాలు: 


కంప్యూటర్‌తో ఎక్కువ సేపు పనిచేసేవారిలో జ్ఞాపకశక్తి లోపించడం, దూరదృష్టి లోపం, చిరాకు పడటం, వెన్నునొప్పి, అనవసరమైన అలసట మొదలైనవి ఏర్పడతాయి. కంప్యూటర్‌తో పని చేయడం అధికంగా ఉంటే మస్తిష్కంతోబాటు కళ్ళు కూడా బాగా అలసిపోతాయి. దీంతో నిద్రతో ఉపశమనం కలుగుతుందనుకుంటే పొరబాటే.

అత్యధిక సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసేవారిలో దృష్టి లోపం ఏర్పడినట్లు వైద్యులు చెబుతున్నారు. అలాంటివారు కళ్ళజోడును ఎక్కువగా ధరిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఇదికాకుండా జ్ఞాపకశక్తి కూడా కోల్పోతున్నట్లు వారి పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.

పని ఒత్తిడి కారణంగా వారిలో చిరాకు పాళ్ళు అధికంగా ఏర్పుడుతుంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారు కార్యాలయంలోని కొపాన్నంతటిని ఇంట్లోని వారిపై చూపుతుంటారని వారు పేర్కొన్నారు. సహజంగా కంప్యూటర్‌తో ఎక్కువ సమయం గడిపేవారిలో ఇలాంటి బాధలు ఉత్పన్నమౌతాయని వారంటున్నారు.

జాగ్రత్తలు పాటించండిలా...!


ముందుగా మీ కంప్యూటర్‌ను మీ కళ్ళకు సమాంతరంగా ఉంచుకోండి. దీంతో మీ కళ్ళకు శ్రమ తగ్గించినవారవుతారు. ముఖ్యంగా మీ కంప్యూటర్‌ను మీరు కూర్చునే స్థానం నుంచి కనీసం రెండు అడుగుల నుండి మూడు అడుగుల దూరంలో ఉంచండి. మరో విషయం ఏంటంటే కంప్యూటర్‌తో నిరంతరం పని చేస్తుంటే మధ్య మధ్యలో కనీసం 5 నుంచి 10 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో దృష్టిని మరల్చండి. దీంతో దూర దృష్టి లోపం రాదంటున్నారు వైద్యులు.


Comments

Popular posts from this blog

సూర్యనమస్కారాలతో ఆ సమస్య తగ్గుతుంది...

రకరకాల ఒత్తిళ్లతో బిజీగా ఉండే మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం చాలా ముఖ్యం. మరి అదేలా సాధ్యం... రోజూ తీసుకునే ఆహారాలలో పోషక విలువలు అధికంగా ఉండాలి. అలానే రోజుకో ఆపిల్ పండు తీసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలతో మహిళలు ఆరోగ్యపరమైన జీవితాన్ని పొందవచ్చును. మరి ఆ వ్యాయామాలేంటో.. ఎలా చేయాలో చూద్దాం... అధిక బరువు గలవారు బరువు తగ్గాలనుకుంటే.. స్క్వాట్స్ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు, హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. తరచుగా సూర్యనమస్కారాలు చేయడం వలన నడుము భాగం గట్టి పడుతుంది. అలానే మోకాళ్లపై భాగం దృఢంగా మారుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.  ప్లాంక్స్ వ్యాయామం చేస్తే.. కండారాలకు చాలా మంచిది. ముఖ్యంగా ఛాతీ, కటి వలయ భాగం దృఢంగా మారుతుంది. ఈ వ్యాయామంతో రక్తంలోని చక్కెర స్థాయిలు మెరుగుపడుతాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో అడ్డంకులు ఉండవు. అలానే నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వ్యాయామం చేయడం వలన ముడతల చర్మం కాస్త తాజాగా మారుతుంది.

కాయకల్ప యోగ భంగిమ దశలు మరియు ఉపయోగాలు

కాయకల్ప యోగ విధానం అనేది యోగ ప్రక్రియలో అత్యంత ప్రశంసనీయమైనది, జీవన శక్తిని మెరుగుపర్చడానికి ఈ యోగ విధానంను అభ్యసించడం జరుగుతుంది. కాయకల్ప యోగ భంగిమల ప్రాథమిక లక్ష్యం- శరీర విధానాన్ని గాడిలో పెట్టడం, సహజంగానే వృద్దాప్య ప్రక్రియను మందగింపచేసి, జీవిత కాలాన్ని పెంచుతుంది. యోగ అనేది భౌతిక జీవితం మరియు స్మారక స్థితితో కూడుకొని ఉంటుంది. కాయకల్ప యోగ విధానంను సాధన చేయడం ద్వారా లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిలోకి రూపాంతరం చెందించవచ్చు. కాయకల్ప యోగ విధానం యొక్క నియమావళి కాయకల్ప యోగ, నరాలు సరైన విధంగా పని చేయడానికి మరియు శరీర కేంద్ర నాడీ వ్యవస్థని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యోగ పద్దతిలో "క్రౌన్ చర్కా" అనే ఆసనం వుంటుంది, దీనిని నుదుటి మధ్య భాగంలో ఉంచుతారు అది శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. ఈ సాధనను ఆచరించడం వలన మనం ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండేలా ప్రోత్సహిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కాయకల్ప నియమావళి వలన సాధకుడు శరీర దారుడ్యం మరియు ఆధ్యాత్మికంగా కూడా సంతృప్తి పొందేలా చేస్తుంది. కాయకల్ప యోగ భంగిమల అనుసరణ     కాయకల్ప యోగ శ్వాససంబంధిత వ్యాయామాలత...

భుజంగాసనంతో శ్వాసకోశ సమస్యలకు చెక్

సాధారణంగా వర్షాకాలంలో అనేక రకాలైన వ్యాధులతో పాటు అనారోగ్య సమస్యలూ వస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే, వర్షాకాలంలో మరింత జాగ్రత్త తీసుకున్నట్టయితే అనారోగ్యం బారినపడకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా శ్వాసకోస వ్యాధలు నుంచి తప్పించుకోవచ్చు. వర్షాకాలంలో ఎదురయ్యే ఈ శ్వాసకోశ సమస్యలను నియంత్రించడానికి ఉత్తమమైన మార్గం యోగాసనాలు. ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో భుజంగాసనం ప్రసిద్ధి చెందింది. ఈ ఆసనం రోజూ వేస్తే శ్వాసకోశ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. శరీరంలోని అన్ని భాగాలకు శక్తినిచ్చే ఆసనం ఇదని, ప్రత్యేకించి యువతకు ఉపయోగకరమని యోగాసన నిపుణులు చెబుతున్నారు.  ఈ ఆసనం వేయడం వల్ల వల్ల గొంతు దగ్గర ఉండే థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. సర్వైకల్‌ స్పాండిలైటిస్‌ అనే మెడకు సంబంధించిన వ్యాధి రాకుండా పూర్తిగా నివారిస్తుంది. ఊపిరితిత్తులు వ్యాకోచం చెంది శ్వాస బాగా ఆడటం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు దరిచేరవు. శరీరం చాలా శక్తివంతంగా మారుతుంది. వెన్నుకు బాగా శక్తివచ్చి వెన్నులోని డిస్క్‌ల సమస్యలు తగ్గిస్తుంది. నాభి వరకు బాగా సాధన చేయడం వల్ల పొట్ట కండరాలు గట్టిపడట...