Skip to main content

దృష్టి లోపం కలిగినవారు యోగా చేయండి

భారతదేశంలో దాదాపు 6 కోట్ల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నారు. ఇది అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకుకూడా చాలెంజ్‌గా మారింది. దృష్టి లోపంతో భాధపడేవారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. అలాగే వారు శారీరకంగాకూడా పరిశుభ్రతను పాటించాలి. ఇలాంటి వారు ఆటపాటలలో, పరుగుపందేలలో పాల్గొనలేక పోతుంటారు. కాబట్టి ఇలాంటివారు యోగాసనాలు చేస్తే ఆరోగ్యంగానే కాకుండా మానసికంగాకూడా దృఢంగానే ఉంటారని యోగా నిపుణులు అంటున్నారు.

దృష్టిలోపంతో బాధపడేవారికి యోగాసనాలు చేయడం ఏమంత కఠినం కాదు. యోగాసనాలు చేస్తే వారికి చాలా లాభాలుంటాయి. దాదాపుగా దృష్టిలోపంతో బాధపడేవారు తమ పనులను చాలావరకు మనోయోగంతో చేస్తుంటారు. దీంతో యోగాసనాలు ప్రారంభించిన రెండు-మూడు రోజులలోనే వారిలో నూతనోత్తేజం పుట్టుకొస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రాణాయామం, ధ్యానం వారికి సహజసిద్ధంగానే అలవడుతాయంటున్నారు.

దృష్టిలోపంతో బాధపడేవారికి ఎలాంటి ఆసనాన్నైనా చేసి చూపాల్సిన అవసరంలేదు. దీనికి బ్రెయిలీ లిపిలో చిత్రాలతోబాటు అక్షర రూపంకూడా ఇచ్చి ఉన్నారు. ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. దృష్టిలోపంతో బాధపడేవారు ఈత కొట్టడం, పరుగులు పెట్టడం, నడవడంలాంటి వ్యాయామాలు చేయలేరు.

కాబట్టి వారు శారీరకంగా, మానసికంగాకూడా బాగా నలిగిపోతుంటారు. అలాగే వారికి జీర్ణక్రియ, శ్వాసక్రియ, రక్త ప్రసరణలలో చాలా మార్పులు సంభవిస్తుంటాయి. దీంతో కేవలం దృష్టిలోపం కారణంగా మరిన్ని జబ్బులకు గురౌతుంటారు. ఇలాంటి వారికి యోగాసనాలు ఓ వరం లాంటిదంటున్నారు యోగా నిపుణులు. శరీరంలోని అన్ని భాగాలుకూడా యోగావలన సక్రమంగా పని చేస్తాయి.

దృష్టిలోపంతో బాధపడేవారు చేయవలసిన యోగాసనాలు : దృష్టిలోపంతో బాధపడేవారు ముఖ్యంగా తాడాసనం, త్రికోణాసనం, హస్తపాదాసనం, ఉత్కరాసనం, అగ్నిసార క్రియాసనం, భుజంగాసనం, మెడను చుట్టటం, బ్రహ్మముద్రాసనం,మార్జరాసనం, శశకాసనం, యోగముద్రాసనం, శలభాసనం, ధనురాసనం, సర్వాంగాసనం, భ్రమరీ ప్రాణాయామంలు కూడా చేయవచ్చని యోగానిపుణులు పేర్కొన్నారు.

వీరు ధ్యానం చేయడంవలన వారి మనసులో ఉదాసీనతా భావాన్ని తగ్గించవచ్చు. దీంతో వారిలో కార్యదక్షతను పెంపొందించుకోవచ్చు. అతి కొద్దికాలంలోనే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమం తప్పకుండా యోగాసనాలు చేస్తుంటే వారిలో జీర్ణక్రియ బాగా జరిగి ఆకలి నియంత్రణలో ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగాకూడా వారి శరీరంలో మార్పులు వస్తాయంటున్నారు యోగా గురువులు.

దృష్టిలోపంతో బాధపడేవారు నడిచేటప్పుడుకూడా వారి మెడను, నడుమును చక్కగా ఉంచి స్థిరంగా నడుస్తారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నట్లు మనం గమనించవచ్చంటున్నారు యోగా ప్రముఖులు.

దృష్టిలోపంతో బాధపడేవారికి ప్రత్యేక పాఠశాలలుండాలి : ముఖ్యంగా మన దేశంలో దృష్టిలోపంతో బాధపడేవారికి ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించాలి. అలాగే వారికి క్రమం తప్పకుండా యోగాభ్యాసంకూడా నేర్పంచి వారిచేత ప్రతిరోజూ చేయిస్తూ ఉండాలి.

దృష్టిలోపంతో బాధపడేవారికి యోగాభ్యాసాలు ప్రత్యేకంగా కష్టమేమీకాదు. వారు తమ పనులను మనోయోగంతో చేస్తుంటారు కాబట్టి కేవలం రెండు-మూడు రోజులలోనే యోగాభ్యాసం చేయడం వలన వారిలో నూతనోత్సాహం ఏర్పడుతుంది. ఆసనాలు వేయడం, ప్రణాయామం చేయడం అలాగే ధ్యానం చేయడం వారికి సహజ సిద్ధంగా అలవడుతాయంటున్నారు యోగాగురువులు.

దృష్టిలోపంతో బాధపడేవారికి ప్రత్యేకంగా పాఠశాలలో ఏర్పాటు చేసి, వాటిలో పై ఆసనాలకు సంబంధించి ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇప్పించాలి. అలాగే వారి పాఠ్యప్రణాళికలలోకూడా యోగాకు సంబంధించిన అంశాలను జోడించాలి. దేశంలోని ప్రతి రాష్ట్రంలోకూడా ఇలాంటి పాఠశాలలను ఏర్పాటు చేయాలంటున్నారు యోగా గురువులు.

Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.